ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే పేపర్ లీకేజ్ కలకలం రేపింది. మొదటి రోజు నుంచి వరుసగా ప్రశ్నపత్రలు వాట్సాప్ లో దర్శనమిస్తూ అందరిని ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేశాయి. దీనికిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో టెన్త్ పేపర్ లీక్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాదీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం డబ్బులు జమచేశారు. 10.85 లక్షల మంది విద్యార్థుల కు 709 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ..చదువు అనేది ఒక దేశచరిత్రను మారుస్తుందని.. తల రాతలు మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడు చదువుకోవాలని విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజ్ ఇష్యూపై సీఎం స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారని పరోక్షంగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండీ: YSR విగ్రహాన్ని ఈడ్చుకెళ్లిన యువకుడు.. చితకబాదిన వైసీపీ కార్యకyర్తలు! వీడియో వైరల్!
పేపర్ లీక్ చేసింది రెండు నారాయణ స్కూల్స్, మూడు శ్రీచైతన్య స్కూల్స్ అని సభలో ముఖ్యమంత్రి పేర్లు బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో నారాయణ మంత్రిగా పనిచేశారని.. ఆయనకు సంబంధించిన స్కూళ్లు, కాలేజీల నుంచి ప్రశ్నపత్రాలను లీక్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నపత్రాలను ఫొటోలను తీసి వాట్సాప్లో షేర్ చేస్తూ.. వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.’వాళ్లే పేపర్లు లీక్ చేసి.. దొంగే దొంగ అన్నట్లుగా ప్రశ్నపత్రాలు లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడతారు. ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందోనని కడుపుమంట నుంచి కుళ్లు, కుతంత్రాలు ఏస్థాయి పోతున్నాయో ప్రజలు గమనించాలి..’ అని సీఎం జగన్ సూచించారు. మరి.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.