హైదరాబాద్- తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేడుకలు, పండుగల వేళ ప్రజలు గుంపులుగా ఉండకుండా నివారించేందుకు ఆంక్షలు విధించాలని హైకోర్టు సూచించింది. ఈ అంశంపై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.