టీఎస్ఆర్టీసీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తున్నారని సజ్జనార్ తెలిపారు. ఆదాయపెంపులో ప్రజల భాగస్వామ్యం ఉందని అన్నారు. ఇలాగే ప్రజలు ఆర్టీసీని ఆదరిస్తూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. కాగా, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మార్గదర్శిని ఎంచుకుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ గా తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న సెన్సెషనల్ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా నియమించబడిన విషయం తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆర్టీసీని ముందుకు తీసుకువెళ్లేందుకు వినూత్న రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సజ్జనార్ తన మార్క్ చాటుకుంటున్నారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందివ్వడంతో పాటు ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఆదాయం సమకూర్చే పనిలో ఉన్నారు. ఇందుకోసం సమకాలీన అంశాలను సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు. గత కొంత కాలంగా డీజిల్, పెట్రోలు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులతో పాటు ఆర్టీసీకి ఈ పెరిగిన ధరలు గుదిబండలా మారుతున్న విషయం తెలిసిందే. ఇంధన ధరలు పెరగడంతో మోటారు వాహనాలు నడిపే వారు అధిక వసూళ్లు చేస్తున్నారు. దాంతో ఇతర వాహనాల్లో దూర ప్రయాణం చేయాలంటే తలకు మించిన భారం అవుతుంది.
తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ప్రచారం ప్రారంభించారు. సూపర్స్టార్ మహేశ్ను అందులో పరోక్ష భాగస్వామిగా మార్చారు. ప్రిన్స్ మహేశ్ చిత్రాల్లోని ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ జోడించి మీమ్ రూపొందించారు. దాన్ని తన అధికారిక ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశారు. తాజాగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Travel in #TSRTC Safely with less cost#sundayvibes @urstrulyMahesh @puvvada_ajay @Govardhan_MLA @RGVzoomin @DarshanDevaiahB @HUMTA_hmdagov @airnews_hyd @maheshbTOI @balaexpressTNIE @V6_Suresh @PranitaRavi @baraju_SuperHit @abntelugutv @AbhiramNetha @iAbhinayD @Telugu360 @TSRTCHQ pic.twitter.com/hvQVZytMNe
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 31, 2021