సామాన్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగలు అంటే దసరా, సంక్రాంతి. కుటుంబాలకు దూరంగా.. ఎక్కడెక్కడో ఉంటున్నవారు పండుగ పూట తప్పకుండా సొంత ఊరికి వెళ్తారు. అందుకే ఈ రెండు పండుగల సీజన్ లో బాగా రద్దీగా ఉంటుంది. ప్రభుత్వం కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే వాటికి అదనపు ఛార్జీల బాదుడు ఉంటుంది. అయితే ఈసారి అలాంటి బాదుడు ఉండదని శుభవార్త చెప్పారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
ఇది కూడా చదవండి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం
సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని.. వివిధ ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోందని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి 3,400, జేబీఎస్ నుంచి 1,200 రెగ్యులర్ బస్సులు నడుపుతుండగా.. పండుగ వేళ అదనంగా మరో 4322 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వీటిలో తెలంగాణకు 3,338, ఏపీకి 984 బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి : ముగిసిపోయింది.. మూత పడుతుందన్నారు.. కానీ
ఈ బస్సుల నిర్వహణకు 200 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు.. సజ్జనార్ తెలిపారు. ప్రజలందరూ ఈ వెసలుబాటును ఉపయోగించుకోవాలని సజ్జనార్ కోరారు. బస్సుల గురించి సమాచారం కోసం ఎంజీబీఎస్ కి 9959226257, జేబీఎస్ కి 9959226246 నంబర్లకు ఫోన్ చేయొచ్చని ఆయన ట్వీట్ చేశారు.
ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా, సంక్రాంతి పండుగ సందర్భంగా #TSRTC వారిచ్చే అదనంగా 3,318 బస్సులు మరియు 1000 ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయి. వివరాలకు MGBS: 9959226257
JBS: 9959226246 నెంబర్ లపై సంప్రదించండి@TSRTCHQ #ChooseTSRTC @baraju_SuperHit @HiHyderabad @NtvTeluguLive pic.twitter.com/6dQq2oSDzK— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 8, 2022