తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆడపిల్లలకు ఏదైన ఆపదవస్తే.. ఆగమేఘాలపై స్పందిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా అదే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. తెలంగాణా ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్కుని చూపిస్తున్నారు. ఆర్టీసి ఉన్నతి కోసం వినూత్న నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా గురువారం అర్ధరాత్రి టీఎస్ఆర్టీసీకి ఓ యువతి చేసిన ట్వీట్పై సజ్జనార్ వెంటనే స్పందించారు. రాత్రి సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల సౌకర్యం కోసం(వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు ఆపాలని యువతి పాలే నిషా కోరారు. ఆ ట్వీట్పై సజ్జనార్ స్పందించారు. ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు రీట్వీట్ చేశారు. అర్ధరాత్రి సైతం మహిళ సమస్య పై సజ్జనార్ స్పందించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ నిషా కృతజ్ఞతలు చెప్పారు. మరి సజ్జనార్ సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
@tsrtcmdoffice మహిళలు రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు @tsrtc యాజమాన్యం. స్త్రీ లఅవసరాల నిమిత్తం పెట్రోల్ బంక్స్ లల్లో ఒక పది నిమిషాలు ఆపితే మహిళలకు ఎంతో. సౌకర్యవంతంగా ఉంటుంది ( అవసరాలు బయటికి చెప్పలేరు కాబట్టి )ఈ నిర్ణయం వల్ల గౌర్నమెంట్ కి కూడా ఎటువంటి భారం ఉండదు🙏🙏🙏
— Pale Nisha (@NishaPale) January 11, 2022
Already given instructions in this regard@TSRTCHQ @CTMTSRTC @CTMMNCTSRTC
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 11, 2022