నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల్లో బాటలో నడిపేందుకు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సజ్జనార్ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ.. ప్రయాణికులకు టీఆఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ అందించింది. తాజాగా ఎండీ సజ్జనార్ ప్రయాణీకుల కోసం మరో సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా రూ.10 నాణెం విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నాణెలు చెల్లడం లేదని పుకార్లు వ్యాపించడంతో కిరాణ దుకాణ వాల్లు, ఇతర వ్యాపారస్తులు పది రూపాయల నాణేలను తీసుకోవడం లేదు. ఇది ఆర్టీసీ బస్సుల్లో కూడా ఎదురు అవుతున్న సమస్య. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ కండక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులు ఎలాంటి అనుమానం లేకుండా రూ.10 నాణేలను ఆర్టీసీ బస్సుల్లో వినియోగించుకోవచ్చని ప్రకటించారు.
ఇది చదవండి : మరో వివాదంలో బండ్ల గణేష్! అరెస్ట్ తప్పదా?
బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులు ఇచ్చే రూ.10 నాణేలను కండెక్టర్లు తప్పకుండా తీసుకోవాలని అది వారికి తెలిసేలా రాష్ట్రంలోని అన్ని డిపోల అధికారులను ఆదేశించారు. ఇక ఎండీ సజ్జనార్ నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీలో పది రూపాయల నాణెం సమస్యకు చెక్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల దగ్గర పది రూపాయల నాణెం తీసుకోని కండక్టర్లు. ప్రయాణికుల నుంచి టిక్కెట్ కోసం పది రూపాయల నాణేలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆర్టీసీ ఆదేశాలు. #Rs10Coins #10RupeeCoins @TSRTCHQ @tsrtcmdoffice pic.twitter.com/aNZWYWk361
— Hi Hyderabad (@HiHyderabad) December 26, 2021