ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా టూర్లు వేస్తున్నారు ప్రజాశాంతి అధినేత కేఏ పాల్. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి కేఏ పాల్ నివాళులర్పిస్తూ.. శ్రీకాంతచారి తండ్రిని తన పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే సీటు ఇస్తానని వాగ్ధానం చేశారు. తన భర్తకు లేని పోని ఆశలు కల్పించి మోసం చేయాలని చూస్తున్నాడని కేఏ పాల్ పై శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేఏ పాల్ తన భర్తను మభ్యపెట్టి పార్టీలో చేరేలా చేశారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Vignesh Shivan-Nayanthara: పెళ్లి పనులు ప్రారంభించిన నయనతార-విఘ్నేష్ శివన్.. కులదైవం గుడిలో ప్రత్యేక పూజలు!
గత పదిహేను రోజులుగా కేఏ పాల్ తమను టార్గెట్ చేశారని.. బీజేపీలో నుంచి రాజ్యసభ సీటు ఇప్పించే బాధ్యత తనదని తమపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎంతో మంది అమరవీరుల కుటుంబాలు తమకు తెలుసునని.. వారందరినీ తమ పార్టీలో చేరేలా చేయాలని ఖమ్మం కి చెందిన భద్రా అనే వ్యక్తితో రాయభారం చేయించారని ఆమో ఆరోపించారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారని.. అంతేకాదు తన భర్తను బంధించి పార్టీలో పలువురిని చేర్పించాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన భర్తకు ఎలాంటి ఆపద వాటిల్లినా అది కేఏపాల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి : Divya Pandey: సివిల్స్లో 323వ ర్యాంకు వచ్చిందని సంతోష పడింది.. అంతలోనే..
తెలంగాణలో తన మనుగడ సాగించాలని.. తన భర్తను అడ్డు పెట్టుకొని తన కుటుంబంలో చిచ్చులు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక శ్రీకాంత చారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తూ ప్రజలు, తాను ఊరుకునేది లేదని అన్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కేఏ పాల్ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.