Snake Bite : పాములు పగబడతాయో లేదో తెలియదు కానీ, ఓ యువతిని మాత్రం పాములు వెంటాడాయి.. ఏడు నెలల్లో మూడు సార్లు కాటేశాయి.. రెండు సార్లు ప్రాణాలతో బయటపడ్డా.. మూడో సారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఆదిలాబాద్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్లోని బేల మండలం బెదోడకు చెందిన బాలేరావు-రంజనల కూతురు ప్రణాళి(18). 7 నెలల పరిధిలో ఆమె రెండు సార్లు పాము కాటుకు గురైంది. అయితే, సకాలంలో చికిత్స కారణంగా ప్రాణాలతో బయటపడింది. శుక్రవారం హోళీ పండుగ రోజున స్నేహితులతో కలిసి సంతోషంగా హోళీ జరుపుకుంటోంది.
రంగులు అయిపోటంతో తన కాలేజీ బ్యాగులో ఉన్న రంగులు తేవటానికి ఇంట్లోకి వెళ్లింది. రంగులు తీయటానికి బ్యాగులో చెయ్యిపెట్టింది. అందులో నక్కి ఉన్న పాము ఆమెను కాటేసింది. ప్రణాళి తనను పాము కరిచిందని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమెను రిమ్స్కు తరలించారు. అర్థరాత్రి దాటిన తర్వాత చికిత్స పొందుతూ ప్రణాళి కన్నుమూసింది. ఏడు నెలల టైంలో మూడు సార్లు పాముకాటుకు గురై ప్రాణాలు విడవటంపై గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. కుటుంసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మానవత్వం చాటుకున్న బ్యాంకు ఉద్యోగులు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.