గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.. పలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజలను అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే బుధవారం నుంచి మరో 3 రోజులు తెలంగాణలో వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో సెలవులను మరోసారి మూడు రోజుల వరకు పొడగించారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షను రాష్ట్ర ఉన్నత విద్యామండలి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.