ప్రతి నెల రేడియో కార్యక్రమం మన్ కి బాత్ లో ప్రధాని మాట్లాడే సంగతి అందరికి తెలిసిందే. ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావిస్తుంటారు ప్రధాని మోదీ. ఈనెల మాట్లాడిన మన్ కీ బాత్ కార్యక్రమంలో జల సంరక్షణ గురించి ప్రస్తావించారు. “ప్రతి నీటి బొట్టు విలువైనది.. భవిష్యత్తు తరాల కోసం నీటిని పొదుపు చేయాలి. నీటి రీసైక్లింగ్ పై మనం దృష్టి పెట్టాలి” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని చారిత్రక మెట్ల బావి గురించి మోదీ మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మకమైన బన్సీలాల్ పేట మెట్లబావిని విజయవంతంగా పునరుద్ధరించినందుకు ప్రధాని మోదీ అభినందలను తెలిపారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగమన్నారు. సికింద్రాబాద్ లోని బన్సీలాల్ పేట మెట్ల బావి కూడా అటువంటిదేనని చెప్పారు. ఈ మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో మళ్లీ జీవం పోసుకుంది. ఇది 17వ శతాబ్దం నాటి మంచినీటి బావి. అప్పట్లో నిజాం రాజులు కట్టించారు. కెపాసిటీ 22 లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా మెట్ల పైనుంచి దిగి తోడుకోవచ్చు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో మెట్ల బావుల లాగే దీన్ని కూడా అద్భుతంగా నిర్మించారు.ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు నిర్మాణమై ఉంది. భూమి లోపలి నుంచే ఓ నిరంతర నీటి ఊట ఉంది.ఇదే సందర్భంగా ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన 126 ఏళ్ల యోగా గురు స్వామి శివానంద గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ఆయనకు 126 ఏళ్లు. బాబా శివానంద్తోపాటు ఆయన ఫిట్నెస్ కూడా నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఆయన దీర్ఘాయుష్సు పొందాలని కోరుటుంన్నాను అని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. మరి.. మన్ కీ బాత్ లో సికింద్రాబాద్ బావి మెట్ల గురించి ప్రస్తావించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.