సాధారణంగా ఆఫీసుల్లోని ఉద్యోగులు తమ పనిలో బిజీగా ఉంటారు. బ్యాంకుల విషయం అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇక ఇంటికి వెళ్లే సమయంలో ఉద్యోగులు అందరు హడావుడిగా ఉంటారు. ఇలాంటి సమయంలో జరిగే కొన్ని పొరపాటులు ప్రమాదాలకు దారితీస్తాయి. ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. తాజాగా ఓ బ్యాంకులోని లాకర్ గదిలోకి వెళ్లిన ఓ వృద్ధుడిని గుర్తించని అక్కడి సిబ్బంది..బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో బీపీ, షుగర్ సమస్యలున్న ఆ వృద్ధుడు దాదాపు 18 గంటలపాటు బ్యాంకులోనే ఉండిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంకుకి సోమవారం సాయంత్రం 4.20 గంటలకు కృష్ణారెడ్డి(87) వెళ్లాడు. ఆయన తన వ్యక్తిగత అవసర కోసం లాకర్ గదిలోకి వెళ్లాడు. ఆయన లాకర్ గదిలోకి వెళ్లిన సంగతి బ్యాంకు సిబ్బంది గమనించలేదు. దీంతో బ్యాంకు పని వేళలు ముగియడంతో దానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆయన దగ్గర మొబైల్ లేనట్లుంది..దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించలేకపోయాడు. చీకటి పడినప్పటికీ ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు సీసీ కెమెరాలు చూడగా, కృష్ణారెడ్డి బ్యాంకులోనే ఉండిపోయినట్లు గుర్తించారు. మంగళవారం(మార్చి29) ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకు వచ్చి.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి..ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.