రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. వెయ్యి ఎకరాల అడవిని హీరో నాగార్జున దత్తత తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ‘అక్కినేని నాగేశ్వరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్’ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తన భార్య అక్కినేని అమల, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి వెళ్లి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో నాగార్జున అడవిని దత్తత తీసుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అడవిని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు. కాగా, తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. వెయ్యి ఎకరాల దత్తత తీసుకొని ఆయన మాట నిలబెట్టుకున్నారు.
ఇది చదవండి: RTC ప్రమోషన్ కోసం మహేష్ బాబు డైలాగ్.. షేర్ చేసిన సజ్జనార్!
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నాగార్జున అడవిని దత్తత తీసుకున్నారు. నాగార్జున కుమారుడు నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ లతో పాటు మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.