తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి బయటపెడతాం, విచారణ జరుపుతాం అంటూ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. బీజేపీ అంటే ‘బక్వాస్ జుమ్లా పార్టీ’ తప్ప మరొకటి కాదు అన్నారు. ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయన్నారు. జుమ్లా చేయడానికి చూస్తాయని ఫైర్ అయ్యారు.
దేశానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కేటీఆర్ అన్నారు. పంజాబ్లో ప్రధాని కాన్వాయ్ను రోడ్డుపై 20 నిమిషాలకు పైగా నిలిపివేశారు. దీన్నిబట్టి ఆయన దేశంలో నేడు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతోంది. ఈ సందర్బంగా జేపీ నడ్డాపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జేపీ నడ్డా మానసిక సమతుల్యత దెబ్బతింది. స్థానిక బీజేపీ నాయకులు అతనికి ఇచ్చిన స్క్రిప్ట్ జేపీ నడ్డా చదువుతున్నారు అని అన్నారు. నడ్డాకు కేరాఫ్ అడ్డ ఎర్రగడ్డ.. పార్లమెంటులో సమాధానం ఇచ్చిన మంత్రి మెంటల్ బాలన్స్ తప్పిందా… నడ్డాది తప్పిందా? తేల్చుకోవాలి. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ పోయి… సబ్ కా వినాష్.. సత్యనాష్ లా పరిస్థితి తయారైంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది చదవండి : ఈనెల 10న తెలంగాణ బంద్.. పిలుపునిచ్చిన బీజేపీ
తమది కుటుంబ పాలన అన్న విషయం పై కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. తాము ప్రజల చేత ఎన్నుకోబడ్డామని, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర తమదని అన్నారు. జేపీ నడ్డా తన అత్తగారు జయశ్రీ బెనర్జీ పార్లమెంటు సభ్యురాలు అని గుర్తు చేసిన ఆయన, రాజకీయాల్లో బహుళ కుటుంబ సభ్యులు ఉన్న బీజేపీ నేతల పేర్లను కూడా ప్రస్తావించారు. 8 రాష్ట్రాల్లో మెజారిటీ రాక పోయినా అధికారంలో ఉండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరం అని అన్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.