కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో తెలంగాణాలో పర్యటించనున్నారు. రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో నిన్న వరంగల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ దివాలా స్థితిలో వుంది. ఆపార్టీ శవయాత్ర చేస్తోందని టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తరువాత దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. టీడీపీలో ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం కొట్లాడుతుంటే రేవంత్ చంద్రబాబు ఏజెంట్ గా పనిచేశారు. రేవంత్ ఎక్కడ కాలు పెడితే అక్కడ భూస్థాపితమే. కాంగ్రెస్ లోనే రేవంత్ కు ఎవ్వరూ విలువ నివ్వడం లేదు. కాంగ్రెస్ లో రేవంత్ జాయిన్ అయిన తరువాత జీరో అయ్యిందని, కాంగ్రెస్ లో సీనియర్ లలో ఒక్కరైనా రేవంత్ మంచోడు అని చెప్పమనండి అంటూ ఘాటుగా విమర్శించారు.
ఇది కూడా చదవండి: మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ ను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం పని చేసింది ఇద్దరే ఇద్దరు ముఖ్యమంత్రులు. ఒకరు ఎన్ఠీఆర్ మరొకరు కేసీఆర్ అన్నారు.రేవంత్ లాంటి చిల్లర గాళ్ల వాళ్ళ రైతులకు అన్యాయం జరుగుతోంది..ఇకనైనా రేవంత్ భాషను మార్చుకోవాలని హితవు పలికారు. సిగ్గు లేకుండా ఏదో రైతు ధర్నా చేస్తారట..? కిషన్ రెడ్డి రైస్ మిల్లర్లను ఎఫ్సీఐ అధికారులతో విచారణ చేస్తామని అంటున్నారు. రేవంత్ ఏమో సీబీఐ విచారణ అంటున్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు చిల్లర గాళ్ళు అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: సీఎం కుర్చీ పై తనదైన స్టైల్లో స్పందించిన మంత్రి కేటీఆర్