సాధారణంగా హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనదారులు ప్రయాణం చేస్తే పోలీసులు చలానాలు వేస్తుంటారు. దీంతో చాలా వరకు అందరు హెల్మెట్ పెట్టుకుని బైక్ పై బయటకి వస్తారు. అలానే షాద్ నగర్ ప్రాంతంలో కూడా ఏ ఒక్క ద్విచక్ర వాహనదారుడూ హెల్మెట్ ధరించకుండా రోడ్డెక్కడు! ఒక వేళ వచ్చినా సరే.. అధికారులు వారికి ఫైన్ విధించరు. కారణం ఇక్కడ షాద్ నగర్ ట్రాఫిక్ సబ్ ఇన్ స్పెక్టర్ రఘుకుమార్, ఆయన బృందం చేసిన ఓ వినుత్నమైన ఆలోచన. వారు చేసిన కార్యక్రమానికి తెలంగాణ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం దక్కింది. మరి.. అక్కడి ప్రజల్లో మార్పు రావడానికి ఆ సబ్ ఇన్ స్పెక్టర్ చేసిన పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
షాద్నగర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్, ఆయన బృందం దేశంలో ఎక్కడాలేని విధంగా జాతీయరహదారిపై ద్విచక్ర వాహనదారులను తనిఖీ చేసేందుకు రాయికల్ టోల్ప్లాజా వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేకపోతే ఇతర ప్రాంతాల్లో మాదిరిగా అక్కడ ఎటువంటి చలాన్ వేయరు! హెల్మెట్ లేనివారిని బైక్ మీద నుంచి దింపి బస్సు ఎక్కిస్తారు. లేదంటే హెల్మెట్ తెచ్చుకొంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు. ఇలా ఒకటి, రెండు రోజులు కాదు.. రెండున్నరేళ్లు చేసి.. దాదాపు 10,000 మందితో హెల్మెట్ కొనిపించడం విశేషం. షాద్ నగర్ చుట్టుపక్కల 9 మండలాలు, 30కి పైగా గ్రామాల ప్రజలు.. హెల్మెంట్ పెట్టుకునే బైక్ పై బయటకు వస్తారు.అంతే కాక మద్యం తాగి వాహనం నడుపుతే జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ రూల్స్ గురించి వీడియోల ద్వారా రఘు కుమార్ ప్రచారం చేస్తున్నారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగే తీరును కళ్లకు కట్టేలా రూపొందించి.. ఆ వీడియోలను వాట్సాప్ గ్రూప్ ల్లో షేర్ చేస్తున్నారు. ఇలా దాదాపు 100 వీడియోలు రూపొందించారు. అంతే కాక.. డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించిన రఘుకుమార్ సుమారు 4000 మంది లర్నింగ్ లైసెన్స్ పొందేందుకు సహాయపడ్డారు. ఈ జాతీయ రహదారిపై ప్రతిరోజూ దాదాపు 60వేల వాహనాలు తిరుగుతున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉండటానికి రఘుకుమార్ అండ్ టీం చేసిన కృషి కారణం. మరి.. సబ్ ఇన్ స్పెక్టర్ రఘుకుమార్ కృషి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.