గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమేనా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్ గా వస్తోంది. దాంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. తాజాగా తెలంగాణలో లౌక్ డౌన్ పరంపర మొదలైంది. సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఒమిక్రాన్ కేసు నమోదైన గూడెం గ్రామంలో లాక్డౌన్ విధించారు.
వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు డిసెంబర్ 16న దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు.హైదరాబాద్ ఎయిర్పోర్టులో టెస్టులు చేయగా.. నెగిటివ్ అని వచ్చింది. కానీ సొంతూరు వచ్చాక అతడిలో జలుబు లాంటి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్టులు చేయగా.. పాజిటివ్ అని తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్లో ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యింది. అనంతరం యువకుడి ప్రైమరీ కాంటాక్ట్లకు కరోనా టెస్టులు చేయగా.. యువకుడి తల్లి, భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఇదీ చదవండి : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు!
ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ఆంక్షలు విధించారు. కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరునంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ భయంతో మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగూ వస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో ఇప్పటివరకు మొత్తం 104 మంది కోలుకున్నారు.