హైదరాబాద్ బిర్యానీ టెస్ట్కు.. అందునా ప్యారడైజ్ బ్యిరానీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవిదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారు.. తప్పకుండా ఆ టేస్ట్ని ఆస్వాదిస్తారు. ఇక హైదరాబాద్లో రోజుకు ఎన్ని బిర్యానీలు తింటున్నారో లెక్కేలేదు. ఇక మనదగ్గర ప్రతి రోజు బిర్యానీ తినే వారు ఉంటారు. ఈ క్రమంలో ఓ మహిళకు బంపరాఫర్ తగిలింది. ఏడాది పాటు ఉచితంగా ప్యారడైజ్ బిర్యానీ తినే అవకాశం లభించింది. ఈ వార్త తెలిసిన బిర్యానీ ప్రియులు.. అబ్బా.. లక్కీ చాన్స్ కొట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు..
హైదరాబాద్కు చెందిన రక్షిత రెడ్డి అనే మహిళ.. కుటుంబంతో కలిసి ప్యారడైజ్ హోటల్కి బిర్యానీ తినడానికి వెళ్లింది. ఇక బిల్లు కట్టేటప్పుడు ఆ హోటల్ వాళ్లు.. ఆమెకు చెప్పిన న్యూస్ విని ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఏంటంటే.. యాభై వేలవ బిర్యానీ కొనుగోలుదారుడికి ఏడాది పాటు ఉచిత బిర్యానీని ఆఫర్ చేస్తున్నామని.. అందులో రక్షిత రెడ్డి విజేతగా నిలిచారని చెప్పేశారు. అంతేకాక వెంటనే ఆమెతో కేక్ కట్ చేయించి.. ఆఫర్ కూపన్లు చేతిలో పెట్టారు.
ఇది కూడా చదవండి: GHMC అధికారులును పరుగులు పెట్టించిన అనుపమ పరమేశ్వరన్.. థాంక్స్ చెబుతున్న నెటిజన్లు!
ప్యారడైజ్ వాళ్లు అమ్మిన 50 వేల బిర్యానీని ఆమె కొనుగోలు చేశారట. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. యాభైవేల బిర్యానీ కొనుగోలు చేసిన వారికి ప్యారడైజ్ బంపరాఫర్ ప్రకటించింది. దానిలో రక్షిత రెడ్డి గెలిచింది. అయితే ఏడాది మొత్తం తినొచ్చు కదా అని రోజు వచ్చి తింటారని అనుకున్నారేమో కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ప్రకారం .. ఏడాది పాటు తినొచ్చు..కానీ నెలకు ఒక్క సారే. అంటే పన్నెండు బిర్యానీలు ఫ్రీ అన్నమాట.
నాణ్యమైన బిర్యానీ కోసం ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్యారడైజ్ పేర్కొంది. అత్యుత్తమ ఆహారం, అత్యున్నత సేవలపై ఈ ప్రచారం ఆధారపడి ఉందని తెలిపింది. ‘ఒక నెలలోనే 50 వేల మందికి పైగా వినియోగదారులు తమ ఉచిత బిర్యానీని రిడీమ్ చేసుకున్నారు. ప్యారడైజ్ వినియోగదారులు ఎవరైనా సరే.. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా, బిల్లు చెల్లింపుల సమయంలో తమ మొబైల్ను చూపించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. కస్టమర్లు తమకు నచ్చిన ఏదైనా ప్యారడైజ్ రెస్టారెంట్కు వెళ్లి తమ ఆఫర్ రిడీమ్ చేసుకోవచ్చు. కొనుగోలు సమయంలో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా బిర్యానీ పొందవచ్చు’ అని ప్యారడైజ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Venu Udugula: ‘విరాటపర్వం’ దర్శకుడికి బెదిరింపు కాల్స్.. సాయిపల్లవి మాటలే కారణమా?
ప్యారడైజ్ అభిమానులు ఈ కార్యక్రమ సభ్యత్వం ద్వారా వినోదాత్మక జెమ్ ఆధారిత రివార్డ్ వ్యవస్థతో పాటుగా ఇతర ప్రయోజనాలనూ పొందారని నిర్వాహకులు తెలిపారు. ఉచిత బిర్యానీలతో పాటు ప్రతి 100 రూపాయల విలువ కలిగిన కొనుగోళ్లపై రెండు జెమ్స్ను ప్యారడైజ్ సర్కిల్ ద్వారా పొందవచ్చని వివరించారు. ఈ జెమ్స్ను రివార్డ్స్ పాయింట్స్గా పంపిణీ చేస్తారు. వీటిని ఏ సమయంలో అయినా రిడీమ్ చేసుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Boycott Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ను ఏకిపారేస్తున్న నెటిజన్లు.. గుడిలోకి చెప్పులేసుకుని వెళ్తారా.. బాయ్కాట్ బ్రహ్మస్త్ర!