తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చి కంపెనీలు నెలకొల్పడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయనే సంకల్పంతో మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు విదేశీ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు చేశారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ సత్తా చాటుతున్నారు. పలు కంపెనీలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న కేటీఆర్.. ఇప్పటికే పలు కంపెనీలు తమ కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేసే దిశగా ఆయా కంపెనీల యాజమాన్యాలను ఒప్పించారు.
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి…
రాష్ట్రంలో రూ. 1,000 కోట్లతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టమ్ను అభివృద్ధి చేయనున్న ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ఫిష్ ఇన్ కంపెనీ. అమెరికాలో మంత్రి @KTRTRS గారితో సమావేశం అనంతరం ప్రకటన. pic.twitter.com/l4OXMwC5yB
— TRS Party (@trspartyonline) March 24, 2022
గురువారం నాడు మరో కీలక పెట్టుబడిని కేటీఆర్ సాధించారు. తెలంగాణలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఫిషిన్ అనే సంస్థ అంగీకరించింది. అంతేకాకుండా కేటీఆర్ సమక్షంలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టమ్ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా రూ.1,000 కోట్లను వెచ్చించనుంది. ఈ కంపెనీ ప్లాంట్ ద్వారా ఏకంగా 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సమాచారం. ఫిషిన్ కంపెనీ ప్రపంచంలోనే అత్యధికంగా చేపలను ఎగుమతి చేసే సంస్థగా పేరుంది.
Another Major Investment heading to #Telangana
One of the Largest Fish importer Company Fishin’ will be investing 1000crores in TS & entered into an MOU in presence of Minister @KTRTRS garu
This investment is going to generate 5000 employment opportunities in TS pic.twitter.com/aFS9W9Nu99
— Dinesh Chowdary (@dcstunner999) March 24, 2022