ఇటీవల కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిఫథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిపోయింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో పోలీసులు హెచ్చిరించినప్పటికీ ఆందోళన కారులు వినకపోవడంతో ఫైరింగ్ జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో దామెర రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు ఇలా చనిపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. అతని కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేసి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి వారి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ బిడ్డలను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ కి నివాళులర్పిస్తూ.. నర్సంపేట నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. యువత, ఆర్మీ అభ్యర్థులు అంతా కలిసి వరంగల్ ఎంజీఎం మార్చురీ నుంచి రాకేష్ స్వగ్రామమైన నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం దబ్బీర్ పేట వరకు భారీ ర్యాలీ జరగనుంది. దబీర్పేటలో రాకేశ్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.