ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరెంటు సరఫరాను నిలిపివేసి, కిటికీల నుంచి ఫైరింజన్తో నీళ్లు చల్లి, ఎంపీ కార్యాలయ ద్వారాన్ని బద్దలు కొట్టి సంజయ్ని అరెస్టు చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన అనంతరం మానకొండూరుకు పోలీసులు తరలించారు. అక్కడి నుంచి పీటీఎస్కు సంజయ్ తరలించారు. ఈ నేపథ్యంలో పీటీసీకి భారీ సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. బండి సంజయ్ దీక్షకు సంబంధించి ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. కొవిడ్ నిబంధనలకు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కల్పించినందుకు అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు.
ఇక బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటెల ప్రభుత్వ తీరును ఖండించారు. ఇప్పటికే విషయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం వ్యవహారాన్ని కేంద్రానికి, జాతీయ నాయకత్వానికి నివేదించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్ వ్యవహారంపై ఆరా తీశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దీక్ష చేస్తుంటే.. పోలీసులు కార్యాలయ డోర్లును పగులగొట్టి, లోపలికి వెళ్లి అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు. తెలంగాణలో బీజేపికి గొప్ప ఆదరణ పెరిగిపోతుందని అక్కసుతో అధికార పార్టీ ఇలా తెగబడుతుందని అన్నారు. వినాశకాలే.. విపరీతబుద్ధి అన్నట్లు కేసీఆర్ చేసుకున్న వాటికి భవిష్యత్తులో ఆయనే ఇబ్బందిపడతారు. మొత్తం బీజేపీ నాయకులంతా ఒక్కటై దీనిపై కొట్లాడుతాం.. అంతేకాకుండా, కేసీఆర్ ప్రభుత్వంపై రాజ్యాంగపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని అని జేపీ నడ్డా తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు.
कल रात @BJP4Telangana के प्रदेश अध्यक्ष @bandisanjay_bjp जी के साथ तेलंगाना की केसीआर सरकार ने जिस अमानवीय तरीके से मारपीट की, कार्यकर्ताओं पर लाठीचार्ज किया और उन्हें गिरफ्तार किया, वह दुःखद एवं निंदनीय है। यह लोकतंत्र की हत्या है। हम इस कुत्सित प्रयास की कड़ी भर्त्सना करते हैं। pic.twitter.com/CE66azMLPj
— Jagat Prakash Nadda (@JPNadda) January 3, 2022