మన దేశంలో సినిమా హీరలకు, క్రీడాకారులకు ధీటుగా రాజకీయ నాయకులకు కూడా ఓ రేంజ్లో అభిమానులుంటారు. ఇక తమ ప్రియతమ నేతపై తమకు ఎంత అభిమానం ఉందో చాటుకోవడానికి విభిన్న ప్రయత్నాలు చేస్తారు. కొందరు పూజలు నిర్వహిస్తే.. మరి కొందరు పాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇప్పుడ మీరు చదవబోయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. ఇక్కడ ఓ యువకుడు కేటీఆర్ సీఎం కావాలని పాద యాత్ర చేస్తున్నాడు. దీనిలో విడ్డూరం ఏం ఉంది అంటే ఆ యువకుడు ఆంధ్రప్రదేశ్ వాసి కావడం ఇక్కడ గమనార్హం. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. సదరు యువకుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కి పాదయాత్ర చేపట్టాడు. మరి అతడికి కేటీఆర్ అంటే ఎందుకింత అభిమానమో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా రాజం మండలానికి చెందిన శేఖర్ మంత్రి కేటీఆర్కు వీరాభిమాని. ఎంతలా అంటే కేటీఆర్ పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అంతటితో ఆగక.. ఇప్పటి వరకు మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుబడుతున్న కేటీఆర్ను.. తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలనే బలమైన ఆకాంక్షతో పాదయాత్ర ప్రారంభించాడు. విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టాడు.
ఇది కూడా చదవండి: Davos 2022: దావోస్ వేదికగా అరుదైన కలయిక.. నెట్టింట వైరలవుతోన్న KTR, సీఎం జగన్ ఫోటోలు!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్), మంత్రి కేటీఆర్ రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని శేఖర్ చెబుతున్నాడు. తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్నాడు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నానని చెప్పాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: KTR: AP పై కామెంట్స్ విషయంలో వెనక్కి తగ్గిన KTR!