మనిషికి కూడు, గుడ్డతో పాటు ఇంత గూడు ఉంటే బాగుంటుందని అనుకుంటారు. చిన్న ఇల్లు అయినా తమకు సొంతంగా ఉండాలని ప్రతిఒక్కరూ భావిస్తుంటారు. ఇందుకోసం అహర్శిశలూ కష్టపడుతుంటారు. ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కొంత మంది దళారులు, రాజకీయ నాయకులు మీకు ప్రభుత్వ ఇల్లు వచ్చేలా చేస్తామని పేదలను మోసం చేస్తూ డబ్బులు లాగుతున్నారు. మరోవైపు ఇలాంటి దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.
ఇటీవల డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని చెప్పి పాత ఇళ్లు కూల్చేశారు. కానీ ఇప్పటి వరకు వాటికి మోక్షం లేదు.. ఏళ్లూ గడుస్తున్నా ఇండ్లు లేవు. తమ గోడు చెప్పుకోవడానికి ఎవరూ దిక్కులేరని.. తమ కష్టాలు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో కొంత మంది చెంచులు జీవిస్తున్నారు. కొంత మంది ఇళ్లు లేక చిన్నపాటి బాత్రూమ్ లోనే కాలం గడుపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ లోని చెంచులు తఘోరమైన స్థితిలో బతుకుతున్నారు.
2019 సమయంలో తెంగాణలో కొన్ని ప్రాంతాల్లో పల్లె ప్రగతి పథకం కింద పాత ఇండ్లను కూల్చి వేసి వాటి స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తామని చెప్పి అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్ మంజూరు చేశారు. ఈ క్రమంలో పాత ఇండ్లను అన్నింటిని కూల్చి వేశారు. ఇప్పటికీ నాలుగు ఏళ్లు కావొస్తున్న కొత్త ఇంటి నిర్మాణాలకు చేపట్టలేదు. దీంతో చేసేదేమీ లేక తమ సొంత స్థలంలో గుడిసెలు వేసుకున్నారు. ఈ క్రమంలో కర్రె లక్ష్మమ్మ కొంత కాలంగా తనకు నివసించడానికి ఇళ్లు లేక బాత్ రూమ్ నే ఇల్లుగా చేసుకొని జీవిస్తుంది.
ఇటీవల తన ఇంటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వ అధికారులు.. ఇప్పటి వరకు కంటికి కనిపించలేదని వాపోయింది. ఇక్కడ ఉన్న చెంచులకు పెన్షన్ కూడా అందడం లేదని.. తాము రూ.30 వేలు ఇస్తే కొత్త ఇల్లు ఇప్పిస్తామని కొంత మంది లీడర్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు ఉన్న ఇంట్లో తలదాచుకుంటూ ఉంటే.. వాటిని కూల్చి ఇప్పుడు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోయింది లక్ష్మమ్మ. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకొని ఇంటి నిర్మాణాలు చేపట్టాలని చెంచులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ చేస్తున్నారు.