ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన పీఆర్సీ ఉద్యమం తారాస్థాయికి చేరింది. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. నిర్బంధాలను దాటుకుని సుమారు 50 వేల మంది ఉద్యోగులు విజయవాడ వచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి తమకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని అన్నారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.విజయవాడ లో ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వం వ్యవరిస్తున్న నియంతృత్వ తీరును ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రివర్స్ పీఆర్సీని జగన్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడలు వీడి సమస్యలకు పరిష్కారం చూపాలని హితవు పలికారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇది లక్షలాది ఉద్యోగులకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని నిలదీశారు. రాజకీయ పార్టీల నేతలను ఎలా గృహనిర్బంధాలు చేస్తున్నారో, ఉద్యోగులను కూడా అదే తరహాలో నిర్బంధిస్తుండడం జగన్ వైఖరిని స్పష్టం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.
చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై @ysjagan ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్నాను.ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలి.రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలి..నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలి.(1/5)
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2022
పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం… విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమే. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్…ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారు.(3/5)#TDPSupportsGovtEmployees
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2022
కానీ జగన్ సర్కార్ లా….ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి….ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నా.(5/5)#TDPSupportsGovtEmployees
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2022