శ్రీకాకుళం- సిక్కోలు మహిళ తన సత్తా చాటింది. 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలేలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి రజని మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచి కిరీటం దక్కించుకుంది. మొత్తం వంద మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో, ఫైనల్కు 38 మంది అర్హత సాధించారు. ఫైనల్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి రజని విజేతగా నిలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మిసెస్ డైనమిక్ టైటిల్, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్, క్రౌన్ విజేతగా మొత్తం మూడు టైటిళ్లను గెలుచుకున్న ఏకైక మహిళగా పైడి రజని రికార్డు నెలకొల్పారు. కరోనా ఎఫెక్ట్ తో 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పోటీలను వర్చువల్ విధానంలో నిర్వహించారు. గతంలో మిసెస్ ఇండియా విన్నర్గా నిలిచిన మిసెస్ మమత త్రివేది ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.
సింగపూర్, ముంబై, బెంగళూరు, చెన్నైకి చెందిన వారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్టలో పైడి రజనీ జన్మస్థలం. ఆమె రజనీ ఎంఏ, ఎంఈడీ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ చేసి, అంబేడ్కర్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ చేశారు. రజని భర్త పైడి గోపాలరావు పాల కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా చేశారు.
మొత్తం రెండు పీజీలు చేసిన రజని ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో ఇంగ్లిష్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో తాత్కాలిక లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. జేసీఐ ఇంటర్నేషనల్ సంస్థ ఫెమీనా అధ్యక్షురాలి పైడి రజనీ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. క్లాసిక్ కేటగిరిలో పైడి రజనీ విజేతగా నిలవడంపై శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.