హైదరాబాద్- తెలంగాణ ఆర్టీసీకి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. అందేంటీ మహేష్ బాబు అబి బస్ కు కదా బ్రాండ్ అంబాసిడర్ అని మీరు అనుకుంటున్నారు కదా. అవును నిజమే.. కానీ తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, మహేష్ బాబును టీఎస్ఆర్టీసీ ప్రచారానికి వాడేసుకుంటున్నారు. సంక్రాతికి తెలంగాణ ఆర్టీసీని ప్రమోట్ చేసే అంశంలో మహేష్ బాబును ఉపయోగించుకున్నారు సజ్జనార్.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థను సంస్కరించేందుకు సజ్జనార్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రయాణికులకు చేరువ చేసే క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా సజ్జనార్ వదలడం లేదు. ప్రధానంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు సజ్జనార్. ఇందులో భాగంగానే పలు రకాల మీమ్స్ను క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
సంక్రాంతి పండగ సందర్భంగా సొంత ఉళ్లల్లోకి వెళ్లడానికి టీఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలంటూ ఓ మీమ్ను రూపొందించి పోస్ట్ చేశారు సజ్జనార్. సంక్రాంతి సమయంలో చాలామంది సొంతూళ్లకు వెళ్తుంటారు. అందులోను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రజేశ్ కు వెళ్లేవారు చాలామందే ఉంటారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ టిక్కెట్ ధరలను భారీగా పెంచింది. ఐతే తెలంగాణ ఆర్టీసీ మాత్రం టిక్కెట్ ధరను పెంచలేదు. ఈ విషయాన్నే పరోక్షంగా చెప్పిన సజ్జనార్, ప్రయాణికులందరూ తెలంగాణ ఆర్టీసీలో టికెట్లు బుక్ చేసుకోండి.. డబ్బులను ఆదా చేసుకోండి.. అని ట్వీట్ చేశారు.
ఈ విషయాన్ని ప్రయాణీకులకు చెప్పేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు డైలాగ్ను వాడుకున్నారు సజ్జనార్. ఇందు కోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మహేశ్, థర్టీ ఇయర్స్ పృథ్వీ రాజ్ల మధ్య జరిగిన సంభాషణను మీమ్గా మార్చారు. పృథ్వీ మహేశ్తో మాట్లాడుతూ.. సంక్రాంతికి మన ఊరు వెళ్దాం అంటేనే భయమేస్తోంది అయ్యా.. అన్ని టికెట్స్ రేట్లు పెంచేశారు.ఎక్కడా సేఫ్టీ కూడా లేదు.. అని అంటాడు.
అందుకు మహేశ్ బాబు స్పందిస్తూ.. అందుకే బాబాయ్ నాలా సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ టికెట్ బుక్ చేస్కో, తక్కువ ధరతో భద్రతతో కూడిన ప్రయాణం చేసేయ్.. అంటాడు. పృధ్వి స్పందిస్తూ..ను వ్వు సూపర్ రా అబ్బాయ్ మంచి సలహా ఇచ్చావ్.. అని చెబుతాడు. ఇదిగో ఈ మీమ్ను ట్వీట్ చేసిన సజ్జనార్.. తక్కువ ధరలో బస్సు టికెట్టు, శుభప్రదమైన సుఖ ప్రయాణం TSRTCలోనే.. అంటూ క్యాప్షన్ ను జతచేశారు. సజ్జనార్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Books your tickets for Sankranti vacation now and avoid the last-minute hassle. #TravelWithTSRTC
తక్కువ ధరలో బస్సు టిక్కెట్టు మరియు శుభప్రదమైన సుఖ ప్రయాణం #TSRTC లోనే@TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @urstrulyMahesh @onlymaheshfans @baraju_SuperHit @TrackTwood pic.twitter.com/xlAphzF35l
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 26, 2021