మహారాష్ట్రలో ఓ మహిళ చేసిన పనికి ఎవరైనా సెల్యూట్ చేసి తీరుతారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ కి మార్గమద్యలో ఫిట్స్ రావడంతో ప్రయాణీకులు టెన్షన్ లో పడ్డారు. ఆ సమయంలో ధైర్యం చేసి ఓ మహిళ బస్సు నడిపి అందరినీ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చింది. మహిళలు ఎలాంటి ఆపద సమయంలో అయినా ధైర్యాన్ని, తెగువ చూపిస్తారని ఆ మహిళ నిరూపించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. వివరాల్లోకి వెళితే పూణే లో కొంతమంది మహిళలు, పిల్లలు కలసి షిరూర్లో ఉన్న వ్యవసాయ పర్యాటక కేంద్రానికి వెళ్లారు. అందుకోసం ఓ మినీ బస్సును ఏర్పాటు చేసుకున్నారు.
వ్యవసాయ పర్యాటక కేంద్రాన్ని సందర్శించుకున్న తర్వాత అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. బస్సును నడుపుతున్న డ్రైవర్ కళ్లు తిరిగి పడిపోయాడు. రోడ్డుపై బస్సును ఆపి తనకు ఫిట్స్ వచ్చినట్టు సైగలతో చెప్పాడు. బస్సు ఆగిపోవడంతో అందులో ఉన్నవారికి ఏం చేయాలో తోచలేదు. పైగా పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. బస్సులో ఉన్న యోగితా సతవ్ అనే మహిళ బస్సును నడపాలని నిర్ణయం తీసుకుంది. మొదట అందరూ భయపడ్డారు.. కానీ పరిస్థితి చే జారిపోతుందని ఆమె నిర్ణయానికి ఓకే అన్నారు. ధైర్యంగా బస్సును నడిపి ముందు డ్రైవర్ను ఆస్పత్రికి తీసుకుకెళ్లారు. మిగతా ప్రయాణికుల్ని కూడా వారి ఇళ్లకు చేర్చారు.
ఈ సందర్భంగా యోగితా సతవ్ మాట్లాడుతూ.. తనకు కారు నడపడం తెలుసని, అందుకే ఆ సమయంలో బస్సును నడపాలని అనుకున్నానని యోగితా సతవ్ అన్నారు. ఆ సమయంలో డ్రైవర్ ని ఆసుపత్రికి చేర్చాలని.. ప్రయాణీకులను సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశంతో తాను ఆ పని చేశానని అన్నారు. యోగితా పది కిలోమీటర్ల దూరం బస్సును డ్రైవ్ చేశారు. యోగితా సతవ్ చేసిన పనికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Pune woman drives the bus to take the driver to hospital after he suffered a seizure (fit) on their return journey. #Maharashtra pic.twitter.com/Ad4UgrEaQg
— Ali shaikh (@alishaikh3310) January 14, 2022