కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా చోటు చేసుకుంటాయి. వీటి వెనక గల సాంకేతిక కారణాల గురించి వెల్లడించకపోతే.. ఇక వాటి గురించి రకరకాల పుకార్లు ప్రచారం అవుతాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఇటీవల కాలంలో ఢిల్లీలో చోటు చేసుకుంది. ఒక రైల్వే కానిస్టేబుల్ ఫ్లాట్ ఫామ్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుకోకుండా తన చుట్టు తాను తిరుగులూ కదులుతున్న గూడ్స్ రైలు కిందపడి చనిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలోని రాజా మండి రైల్వే స్టేషన్ లో జరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో సదరు కానిస్టేబుల్ ఇలా పడిపోవడం వెలన గల కారణాలను వెల్లడించారు వైద్యులు. సాధారణంగా ఈ వ్యాధిని గైరేటరీ సీజర్ అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నవారు.. తమకు దగ్గరలోని ఏదైనా పెద్ద శబ్ధం చేస్తూ కదులుతూ ఉంటే ఇలా ఉన్నట్లుండి కళ్లు తిరిగి పడిపోతారు. వేగంగా కదులుతున్న వాటిని చూస్తే 180 డిగ్రీల కోణంలో మన శరీరం భ్రమణం కలుగుతుంది.. దీంతో శరీరంపై నియంత్రణ కోల్పోతారని అంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల వల్లనే చాలా మంది ఫ్లాట్ ఫామ్ వద్ద ఉన్నవారు కదులుతున్న రైలు కింద పడిపోతుంటారని అన్నారు. ఈ కారణంతోనే కదులుతున్న రైళ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
ఇ రైల్వే ఫ్లాట్ ఫామ్ వద్ద చనిపోయిన వ్యక్తి పేరు రింగేల్ సింగ్.. మార్చి 27న స్టేషన్ లో తన విధులు నిర్వహిస్తున్న సమయంలో పట్టాలకు దగ్గరగా ఉన్నాడు. అదే సమయంలో ఒక గూడ్స్ రైలు రావడంతో రింగేల్ సింగ్ ఉన్నట్టుండి గింగిరాలు తిరుగుతూ ఒక్కసారిగా కదులుతున్న గూడ్స్ రైలు కింద పడి మృతి చెందాడు.
वायरल वीडियो: 5 सेकेंड का चक्कर और सीधे मालगाड़ी के नीचे. सीसीटीवी में कैद आगरा के राजा मंडी स्टेशन की हृदय विदारक तस्वीर. पल भर की जिंदगी. #Agra pic.twitter.com/NAMZauNd80
— Himanshu Tripathi (@thimanshut) March 27, 2022