బిడ్డల బాగోగుల కోసం నిత్యం ఆలోచిస్తారు తల్లిదండ్రులు. పిల్లలకు జన్మనిచ్చిన నాటి నుంచి.. వారు పెరిగి పెద్దయి.. జీవితాల్లో స్థిరపడి.. వారికంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే వరకు కూడా పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు. ఆ తర్వాత కూడా వారి ఆలోచనలు బిడ్డల గురించే సాగుతాయి. కానీ అన్నాళ్లు పెంచి పోషించిన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష వైఖరి కనబరుస్తారు చాలామంది సంతానం. అహర్నిశలు తమ కోసం తాతప్రయపడిన తల్లిదండ్రులను.. ఆఖరి రోజుల్లో పట్టించుకోని బిడ్డలు ఎందరో ఉన్నారు. అయినా సరే బిడ్డల మీద ప్రేమతో వారి నిరాదరణను కూడా భరిస్తారు. అయితే అందరు తల్లిదండ్రులు ఇలానే ఉంటారా అంటే కాదు. అక్కడక్కడ కొందరు బిడ్డల వైఖరిని విమర్శించడమే కాక అవసరమనుకుంటే చట్టపరమైన చర్యలకు కూడా వెనకాడరు. ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. తమ కొడుకు, కోడలు ఇంకా బిడ్డను కనలేదని.. వారికి మరోక ఏడాది గడువు ఇస్తున్నామని.. ఈలోపు బిడ్డను కనకపోతే.. తమకు 5 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ వింత సంఘటన వివరాలు..
ఇది కూడా చదవండి: Karnataka: వీడియో: గురక శబ్ధంతో వీడిన వ్యభిచార ముఠా గుట్టు.. అవాక్కయిన పోలీసులు!
ఆశ్చర్యంగా అనిపించే ఈ కేసు ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ఏడాదిలోగా మనవడో, మనవరాలినో తమ చేతుల్లో పెట్టాలని.. లేకుంటే ఐదుకోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టుకెక్కారు హరిద్వార్కు చెందిన ఓ జంట. ‘‘2016లో మా అబ్బాయికి వివాహం చేశాం. ఇప్పటిదాకా పిల్లల్ని కనలేదు. ఆడా, మగా అనే తేడా లేదు. ఎవరో ఒకరిని కనిస్తే చాలు..’’ అని అంటోంది ఆ జంట. మరి ఇక్కడ డబ్బు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా.. తల్లిదండ్రుల పట్ల ఆ కొడుకు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో సమాజానికి తెలియజేయడానికే అలా చేశారట.
ఇది కూడా చదవండి: Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. ఇడ్లీ అమ్మకు ఇల్లు!
ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘మా దగ్గర ఉన్నదంతా మా అబ్బాయి కోసమే ఖర్చు చేశాం. అమెరికాలో చదివించాం. ఘనంగా పెళ్లి చేశాం. ఆపై బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టాం. ఇప్పుడు మా దగ్గర పైసా లేదు. ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. అందుకే కొడుకు కోడలు నుంచి చెరో రెండున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశాం’’ అంటున్నారు ఎస్ఆర్ ప్రసాద్. ‘‘మనం పిల్లల కోసం లెక్కలేసుకోం. మంచి ఉద్యోగాలకు తోడ్పాటు అందిస్తాం. తల్లిదండ్రులుగా అది బాధ్యత. కానీ, పిల్లలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కష్టకాలంలో కనీస అవసరాలకు కూడా డబ్బులివ్వడం లేదు. మనవడో మనవరాలో కావాలని కేసు వేయడం వెనుక వాళ్ల ప్రధాన ఉద్దేశం.. అందరి దృష్టిని ఆకర్షించడమే’’ అంటున్నారు ప్రసాద్ తరపు లాయర్ శ్రీవాస్తవ. మరి ఈ వింత కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Gujarat: మరికొన్ని గంటల్లో పెళ్లి.. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు మృతి!