భారత దేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి చార్ ధామ్ ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని అంటారు. హిమాలయాల్లో కొలువైన ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తమ జన్మను పావనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. హిమాలయాల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో ఎన్నో అవాంతరాలు ఉంటాయి.. చార్దామ్ యాత్ర చేయలనుకోవడం ఒక సాహసం అన్నట్టే అంటారు. అయినా కూడా చార్దామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. చార్ ధామ్ యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..
యమునోత్రి రహదారిపై 28 మంది భక్తులతో వెళ్తున్న ఒక బస్సు అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. మధ్య ప్రదేశ్ నుంచి చార్ ధామ్ కు యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఉత్తర ఖండ్ లో 200 మీటర్ల లోతు లోయలోకి పడిపోయింది. యాత్రికులంతా మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయినట్లు సమాచారం అందుంతుంది. 17 మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
యాత్రికులతో వెళ్తున్న బస్సు అంత ఎత్తుమీద నుంచి లోయలోకి పడిపోవడంతో రెండు ముక్కలైందని పోలీసులు తెలిపారు. అందుకే ప్రమాదంలో చాలా మంది మరణించారని అన్నారు. ప్రమాద స్థలానికి వెంటనే అంబులెన్స్ పంపామని.. వైద్య బృందంతో స్పాట్ కి చేరుకునే లోపు పలువురు మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ అభిషేక్ రుహేలా తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని అన్నారు.
ఈ ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం గురించి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్కు ఫోన్చేసి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అమిత్ షాకి పుష్కర్ సింగ్ వివరించారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామితో మాట్లాడి సహాయకచర్యల గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి పరిహారం ప్రకటించారు.
उत्तराखंड में श्रद्धालुओं की एक बस खाई में गिरी। बस में पन्ना मध्यप्रदेश के रहने वाले 28 श्रद्धालु सवार थे। #ChardhamYatra #Uttarakhand #uttarkashi @DmUttarkashi pic.twitter.com/D8weWPGoFt
— Sonu Kumar (@Sonu_indiatv) June 5, 2022