ఈ మద్య దొంగలు బాగా తెలివిమీరి పోయారు. ఒకప్పడు ఇంట్లో చొరబడి డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీలు చేసేవారు.. కానీ ఇప్పుడు కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతున్నారు. కొంతమంది దొంగలు పట్టపగలు ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇక ఎదుటి వారు ఏమాత్రం ఏమరపాటున ఉన్నా.. సెల్ ఫోన్లు, మనీ పర్సులు కొట్టేస్తున్నారు. కానీ, ఓ దొంగ ఎవరూ ఊహించని విధంగా రైలు బ్రిడ్జి దాటుతున్న సమయంలో బ్రిడ్జిపై కూర్చొని మొబైల్ను దోచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో స్లో మోషన్ లో చూస్తే కానీ ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ వీడియో చూసి షాక్ తిన్న నెటిజన్లు ఇప్పుడు దొంగను స్పైడర్ మ్యాన్ తో పోలుస్తున్నారు. బీహార్ లోని బేగుసరాయ్ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: Pawan Kalyan: నాని సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్! ఆ వివాదమేనా ఇద్దరిని కలిపిందా?
బీహార్ లోని బేగుసరాయ్ లో ఇద్దరు ప్రయాణీకులు గంగా నదిని దాటుతున్నప్పుడు రైలు కంపార్ట్మెంట్ తలుపు వద్ద కూర్చున్నారు. నది దాటుతున్న ఆ క్షణాన్ని క్యాప్చర్ చేయడానికి ఇద్దరి చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఓ వ్యక్తి వంతెన యొక్క రెయిలింగ్ ని పట్టుకొని వేలాడుతున్న ట్రైన్ లో ఫుట్ బోర్డ్ పై కూర్చున్న ప్రయాణీకుడి ఫోన్ లాక్కున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందన్న విషయం గ్రహించడానికి బాధితుడికి కొంత సమయం పట్టింది.
ఇది కూడా చదవండి: Harish Shankar: భవదీయుడు భగత్ సింగ్ అసలు ఉంటుందా? హరీశ్ శంకర్ ఏమన్నారంటే..!విచిత్రం ఏంటంటే ఈ వీడియో చూసిన నెటిజన్లకు కూడా మొదట ఏమీ అర్థం కాదు.. వీడియో స్లో మోషన్ చూస్తే కానీ అసలు విషయం తెలుస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ ఎంత చెలాకీగా దొంగతనం చేశాడంటే.. ఓరి నాయనో దొంగతనం ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. నెటిజన్లు ఇప్పుడు దొంగను స్పైడర్ మ్యాన్ తో పోలుస్తున్నారు. ట్రైన్ లో ప్రయాణించే సమయంలో ఫుట్ బోర్డ్ పై కూర్చున్నపుడు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇలాంటి దారుణాల జరుగుతాయని ఈ సంఘటన చెబుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Watch: A video has gone viral on social media of a thief hanging from a bridge and #snatching a train passenger’s phone in Bihar’s #Begusarai pic.twitter.com/l9JJcg16w6
— TOI Patna (@TOIPatna) June 10, 2022