ఓ వ్యక్తి చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక స్నానం చేయించాలని అనుకుని నీరు పోస్తుండగా చనిపోయిన మనిషి కదలడం, శ్వాస తీసుకోవడం మొదలు పెట్టాడు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ లోని కరణ్ పూర్ కు చెందిన అజాబ్ సింగ్ అనే వ్యక్తికి ఒక్కసారిగా బీపీ లెవల్స్ తగ్గడంతో వెంటనే స్థానికంగా ఉండే లక్సర్ లోని హిమాలయన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి అతనికి వైద్యులు పరీక్షలు చేసి 4 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఇక ఉన్నట్టుండి వైద్యులు మేము మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా అజాబ్ సింగ్ ని బతికించలేకపోయామంటూ కుటుంబ సభ్యులకు వివరించారు. ఇక కన్నీరు మున్నీరుగా విలపించి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.ఇందులో భాగంగానే అతనికి స్నానం చేయిస్తుండగా చేతులు, కాళ్లు కదిలించడం శ్వాస తీసుకోవడం మొదలు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ గురయ్యారు. వెంటనే మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మొదట అజాబ్ సింగ్ కి వైద్యం అందించిన ఆస్పత్రి డాక్టర్లు తప్పడు సమాచారం ఇచ్చారని గ్రహించి వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.