కరోనా వైరస్ దేశాన్ని ఎన్ని తిప్పలు పెడుతుందో తెలిసిందే. అయితే, ఈ వైరస్ నుంచి తమని రక్షించాలని కోరుకుంటూ ఉత్తరప్రదేశ్లో ఏకంగా కరోనా మాత పేరుతో ఆలయాన్నే కట్టేశారు. శుక్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఆలయానికి స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఈ వైరస్ను ఎదుర్కొనే శక్తి తమకు లేదని, ఈ మహమ్మారి నుంచి నీవే మమ్మల్ని రక్షించాలంటూ గ్రామస్తులు కరోనా మాతకు పూజలు చేస్తున్నారు. ఈ మందిరంలో కరోనా అమ్మవారి విగ్రహం కూడా మాస్కు ధరించి ఉంటుంది.
ఇక్కడికి శుక్లాపూర్ గ్రామస్థులే కాకుండా, పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. అందుకే, ఇక్కడికి వచ్చేవారు తప్పకుండా మాస్కులు ధరించి రావాలని, భౌతికదూరం పాటించాలని స్థానికులు కోరుతున్నారు. శుక్లాపూర్ గ్రామస్థులంతా చందాలు వేసుకుని ఓ వేప చెట్టుకింద ఈ ఆలయాన్ని నిర్మించారు. లోకేశ్ శ్రీవాస్తవ అనే ఓ వ్యక్తి స్థానికుల నుంచి చందాలు సేకరించి ఐదు రోజుల క్రితం ‘కరోనా మాత’ ఆలయాన్ని నిర్మించాడు. అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించి రాధే శ్యామ్ వర్మ అనే వ్యక్తిని పూజారిగా నియమించారు.
కరోనాను నిర్మూలించాలని నిత్యం అక్కడ పూజలు చేస్తూ ధూప ధీప నైవేద్యాలతో ఆరాధిస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మధువనహళ్లి గ్రామంల్లో ఇప్పటికే కరోనా మాత ఆలయాలు వెలిశాయి. యూపీలో ఏర్పాటు చేసిన కరోనామాత గుడి మాత్రం భూమి ఆక్రమణ కోసమే ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి పోలీసులు ఆలయాన్ని కూల్చేశారు. ప్రస్తుతం ఆ స్థలం వివాదంలో ఉందని, అక్కడ ఎటువంటి నిర్మాణాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
‘Corona Mata’ temple comes up under a neem tree at a village in Pratapgarh district
“Villagers collectively decided & set up the temple with belief that praying to the deity would definitely offer respite to people from Coronavirus,” a villager said yesterday. pic.twitter.com/jA3SGU0RQE
— ANI UP (@ANINewsUP) June 12, 2021