అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు దొంగతనాలకు పాల్పడుతుంటారు. దొంగలు అనేక రకాలుగా చోరీలు చేస్తుంటారు. ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేసి, బ్యాంకులకు కన్నం వేసి డబ్బులు, బంగారం దోచేస్తారు. కానీ కొంతమంది వెరైటీ దొంగలు కూడా ఉంటారు. కేవలం చిల్లర మాత్రమే దొంగతనం చేస్తుంటారు. ఎంత డబ్బు ఉన్న వాటిని ముట్టరు.. కేవలం చిల్లర మాత్రమే ఎత్తుకెళ్తారు. అచ్చం అలాంటి దొంగలే ఓ బ్యాంక్ లో నోట్ల డబ్బులను కాకుండా రూ.11 కోట్ల విలువైన చిల్లర నాణేలను దొంగిలించారు. ఈ ఘటన రాజస్థాన్ లోని మెహందీపూర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలజీ SBI బ్రాంచిలో నాణేలు చోరీకి గురైనట్లు తెలిసింది. చోరీకి గురైన నాణేల విలువ సుమారు రూ.11 కోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేపట్టాలంటూ ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. SBI వేసిన పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు.. సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేసు విచారణను వేగవంతం చేసింది.
ఈ క్రమంలో గతంలో నగదు లెక్కింపును నిలిపివేయాలంటూ వెండర్ వద్ద పనిచేసే సిబ్బందిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింనట్లు తెలిపింది. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం గాలింపు చర్యాలు చేపట్టారు. రూ.11 కోట్ల చిల్లర నాణేలు చోరీకి గురికావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.