సాధారణంగా గృహహింస అనగానే ఆడవాళ్లకు.. మరి ముఖ్యంగా అత్తింట్లో ఎదురయ్యే పరిస్థితి అనే అభిప్రాయం ఉంది. అయితే కొన్నాళ్లే క్రితానికి.. ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. గృహ హింసకు పాల్పడితే కఠినంగా శిక్షించే చట్టాలు అనేకం అమల్లోకి వచ్చాయి. ఇక మహిళలు కూడా బాగా చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారు కనుక.. గృహ హింస బాధితుల సంఖ్య తగ్తుతూ వస్తోంది. అయితే ఆశ్చర్యంగా మగవారి విషయంలో గత కొంత కాలంగా గృహ హింస పెరుగుతోంది. భార్య, బిడ్డలు, అత్తమామలు ఇలా మగవారిని వేధించే వారి జాబితాలో చేరుతున్నారు.
గృహ హింస బాధితులైన పురుషులు పరువు పోతుందనే ఉద్దేశంతో దీని గురించి బయటకు వెళ్లడించడం లేదు. ధైర్యం చేసి చెప్పినా నమ్మేవారు చాలా అరుదు. పైగా మగాడివి.. ఇలా దెబ్బలు తింటున్న అనడానికి సిగ్గు లేదు అంటూ హేళన చేస్తారు. వీటన్నింటికి జడిసి చాలా మంది గృహహింస బాధితులైన మగాళ్లు.. బయటకు వెళ్లడించడం లేదు. ఇప్పుడు మనం చదవబోయే కథనం కూడా ఈ కోవకు చెందినదే. ప్రేమ వివాహం చేసుకున్న ఓ వ్యక్తిని దాదాపు 9 ఏళ్లుగా భార్య చితకబాదుతోంది. ఎందుకంటే.. ఆస్తి తన పేరు మీద రాయనందుకు. ఇన్నాళ్లు మౌనంగా భరించిన భర్త.. ఇక తట్టుకోలేక.. చివరకు భార్య చేసే దారుణాలను సీసీటీవీలో రికార్డ్ చేసి.. మరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలు…
ఇది కూడా చదవండి: Robber Bride: ఆమె వయసు 32.. పెళ్లిల్లు 32.. మరో పెళ్లికి సిద్ధమవుతుండగా.. షాకిచ్చిన పోలీసులు!
రాజస్తాన్ అళ్వార్కు చెందిన అజిత్ యాదవ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తొమ్మిదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొంత కాలం వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత నుంచి దంపతుల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. మరీ ముఖ్యంగా.. ఇంటిని తన పేరు మీద మార్చాలని అడిగింది. అందుకు అతడు అంగీకరించకపోవడంతో.. నిత్యం అతడితో గొడవకు దిగేది. కొద్ది రోజులకు తిట్టడం ఆపి.. ఏకంగా కొట్టడం ప్రారంభించింది. కర్రలు, పైప్, ఇనుప రెంచి, బ్యాట్ ఇలా ఏది దొరికితే అది తీసుకుని.. భర్తను చితకబాదేది.
In a strange case of domestic violence, a school principal in #Alwar district of #Rajasthan has move the court seeking protection from the physical and mental harassment of his wife.
According to the man, his wife has been beating him black and blue leaving him weak mentally. pic.twitter.com/J1UOmRhyHw
— IANS (@ians_india) May 25, 2022
ఇది కూడా చదవండి: Rajasthan: ప్రియుడితో కలిసేందుకు అడ్డొస్తున్న భర్త.. గొడ్డలితో నరికి చంపిన భార్య!
ఈ విషయాలు బయటకు చెబితే.. పరువు పోతుందని.. కొడుకు భవిష్యత్తు పాడవుతుందని భావించి.. అజిత్ దీని గురించి ఎవరికి చెప్పలేదు. కానీ కొన్ని నెలలుగా ఆమె వేధింపులు మరీ ఎక్కువ అవ్వడంతో.. పోలీసులుకు ఫిర్యాదు చేయాలని భావించాడు. చెబితే నమ్మరేమో అని భావించి.. భార్య దారుణాలను రికార్డ్ చేయడం కోసం ఇంట్లో సీసీటీవీ కెమరా బిగించాడు. ఇక భార్య తనను కొడుతున్న దృశ్యాలు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Rajasthan: షాకింగ్ సంఘటన.. నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి!