ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయ పార్టీలు చాలా హామీలు ఇస్తాయి. ఇక గెలిచి అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన హామీల్లో చాలా వాటిని పట్టించుకోరు. మళ్లీ ఎన్నికల ముందు.. వాటిని అమలు చేస్తారు. కానీ తమ పార్టీ మాత్రం ఇందుకు భిన్నం అని.. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన ప్రతి హామీని.. మొదటి ఏడాది నుంచే అమలు చేస్తామని అంటున్నారు పంజాబ్ ఆప్ నేతలు. ఎన్నికల సమయంలో.. తమను గెలిపిస్తే.. ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తామని ఆప్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే దిశగా ఆమ్ ఆద్మీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: పింఛను కోసం జవాన్ భార్య 56 ఏళ్ల న్యాయపోరాటం.. కోర్టు సంచలన తీర్పు!
జులై 1 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుందని వెల్లడించింది. ఈ పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందజేయనున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో విద్యుత్ పథకంపై ఆప్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో ‘మా నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో అద్భుతమైన సమావేశం జరిగింది.. అతి త్వరలో పంజాబ్ ప్రజలకు శుభవార్త అందిస్తాను’’ అని సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: లవ్ చేసుకున్న స్నేహితులు.. ట్రాన్స్జెండర్గా మారి పెళ్లి చేసుకున్నాక బెడిసికొట్టింది!ఇప్పటికే పంజాబ్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమల్లో ఉండగా.. తాజాగా, ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంట్ అందజేయనున్నారు. అంతేకాకుండా, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం వల్ల లబ్ది చేకూరుతుందని ఆప్ భావిస్తోంది. అయితే, ఎన్నికల హామీలు తీవ్ర ఆర్థిక సమస్యలకు కారణమవుతాయని భావిస్తోన్న పంజాబ్ సర్కారు.. ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: లీకైన రణబీర్ కపూర్- అలియా భట్ పెళ్లి వీడియో!