మనం ఎంత గొప్ప హూదాలో ఉన్నా.. ఎదుటి వారికి ఇచ్చే గౌరవం పైనే మన గొప్పతనం ఆధారపడి ఉంటుంది. అలాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు నిరూపించుకున్నారు. మొన్నటికి మొన్న వారణాసిలో పారిశుద్ద్య కార్మికులపై పూలు చల్లి వారి సేవలను ప్రశంసించారు. ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ తనను ప్రత్యక్షంగా కలిసేందుకు వచ్చిన ఓ దివ్యాంగ మహిళ పాదాలను తాకి కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 13న వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించిన కొద్దిసేపటికే శిఖా రస్తోగి అనే వికలాంగ మహిళ వచ్చారు. ఆమె ప్రధాని మోదీ ఆశీర్వాదం కోసం వచ్చారు.. అనూహ్యంగా మోదీనే శిఖా రాస్తోగి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరుగా ఖ్యాతిగాంచిన భారత ప్రధాని మోదీ ఒక దివ్యాంగురాలి పాదాలను తాకిన దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. అంత గొప్ప మనిషి తన పాదాలు తాకడంతో శిఖా ప్రధానికి గౌరవాన్ని ఇస్తూ.. తన కృతజ్ఞతలు తెలియజేసింది.
ఇదీ చదవండి : లైంగిక దాడిపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన మాజీ స్పీకర్!
ఈ సంఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ .. శిఖా రాస్తోగిను అభినందించారు. తాజాగా ప్రధానమంత్రి మోడీ మహిళ పాదాలను తాకిన ఫోటో క్షణంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై శిఖా సోదరుడు విశాల్ మాట్లాడుతూ.. శిఖా పుట్టినప్పటి నుంచి భిన్న వ్యక్తిత్వం గలదని చెప్పారు. తన సోదరిని చూసి గర్వపడుతున్నానని అన్నారు. అంతేకాదు ఎవరి ఇంట్లో దివ్యాంగులు ఉన్నా.. వారిని బలహీనులుగా పరిగణించవద్దని విజ్ఞప్తి చేశారు.
यह सम्मान समस्त नारी शक्ति का सम्मान है । गर्व है हम सभी को अपने प्रधानमंत्री श्री @narendramodi जी पर । pic.twitter.com/L989Wp8Ukl
— Vanathi Srinivasan (@VanathiBJP) December 15, 2021