Osama Bin Laden: ఓ ప్రభుత్వ ఆఫీసులో ఒసామా బిన్ లాడెన్ ఫొటో దర్శనమిచ్చిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. ప్రభుత్వ పవర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఓ అధికారి లాడెన్ను రోల్ మోడల్గా పేర్కొంటూ ఆఫీసులో ఆయన ఫొటోను తగిలించాడు. చివరకు ఉద్యోగం పొగొట్టుకుని వీధి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ ప్రభుత్వ అధికారి ఉత్తర ప్రదేశ్, ఫరూఖాబాద్లోని ‘దక్షిణాంచల్ విద్యుత్ వితరన్ నిగమ్ లిమిటెడ్లో సబ్ డివిజన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన తన ఆఫీసు గదిలోని గోడకు అల్ఖైదా ఉగ్రవాది ‘ఒసామా బిన్ లాడెన్’ ఫొటో తగిలించుకున్నాడు.
ఫొటో కింద ‘గౌరవనీయులైన ఒసామా బిన్ లాడెన్.. ప్రపంచంలోనే గొప్ప జూనియర్ ఇంజినీర్’ అని రాసి ఉంది. ఈ ఫొటోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు దీనిపై సీరియస్ అయ్యారు. ఎస్డీఓ రవీంద్రను సస్పెండ్ చేయటంతో పాటు ఆఫీసునుంచి ఫొటోను తొలగించారు. ఈ ఘటనపై దర్యాప్తు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికను త్వరలో ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.
Picture of Osama Bin Laden in the office of power department SDO in UP’s Farrukhabad district. “World’s best junior engineer” is the title bestowed to him. Sources claim the photo has now been removed after the matter surfaced in media. pic.twitter.com/atae0kQbGF
— Piyush Rai (@Benarasiyaa) June 1, 2022
సస్పెన్సన్కు గురైన ఎస్డీఓ రవీంద్ర దీనిపై మాట్లాడుతూ.. ‘‘ ఒసామా బిన్ లాడెన్ ప్రపంచంలోనే గొప్ప జూనియర్ ఇంజినీర్. ఆ ఫొటోను తీసివేసుండొచ్చు. కానీ, నా దగ్గర ఆ ఫొటోకు సంబంధించి చాలా కాపీలు ఉన్నాయి’’ అని అన్నారు. కాగా, రవీంద్ర ఒసామా బిన్ లాడెన్కు సంబంధించి ఓ పుస్తకం చదివాడని, ఆ పుస్తకంలో ఒసామా ఓ పెద్ద సివిల్ ఇంజినీర్ అని ఉందని, ఆ పుస్తకం చదివిన తర్వాతినుంచి అతడు ఆఫీసు గదిలో ఫొటో పెట్టుకుంటున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్