ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో గంజాయి కూడా ఒకటి. పోలీసులు, అధికారులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా నిషేదిత గంజాయి ప్రజలకు అందుతూనే ఉంది. అలాంటి వాటికి బానిసలుగా మారి ఎంతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి గంజాయి అక్రమంగా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని పోలీసులు కోర్టుకు తరలిస్తున్న క్రమంలో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా కరూర్ లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. దిండిగల్ జిల్లాకు చెందిన పొన్నుస్వామి గంజాయి తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరు పరిచేందుకు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. కరూర్ కోర్టుకు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో పొన్ను స్వామి బైక్ పై నుంచి దూకేశాడు.
కోర్టుకు వెళ్తే శిక్షపడుతుందనే భయంతో పొన్ను స్వామి బైక్ పై నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. అలా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కంగారుగా రోడ్డుపై పరిగెత్తసాగాడు. ఆ క్రమంలో చూసుకోకుండా రోడ్డుపైకి రాగానే.. అటు వెళ్తున్న కారు పొన్నుస్వామిని ఢీకొట్టింది. అతను అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఆ వేగంలో కారు పొన్నుస్వామి పైకి ఎక్కగా.. అక్కడికక్కడే చనిపోయాడు. శిక్షకు భయపడి తప్పించుకోవాలనుకున్నాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంటూ చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.