సాధారణంగా బంగారం, డబ్బు, వాహనాలు.. ఆఖరికి పంటలను కూడా దొంగిలించే వారి గురించి విన్నాం, చూశాం. కానీ కొందరు కక్కుర్తి వ్యక్తులు.. చెప్పులు, దుస్తులు కూడా వదలరు. ఇక మన దగ్గర చెప్పులు పోతే.. వాటితో పాటే శని కూడా పోతుందని భావిస్తారు.. పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం ఇందుకు పూర్తిగా భిన్నమైంది. ఇక్కడో రైతు.. తన చెప్పులు పోయానని… దాని వెనక కుట్ర కోణం దాగి ఉందని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే పెద్ద పెద్ద కేసులతో తలలు పట్టుకున్న పోలీసులు తొలత ఈ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. కానీ చివరకు ఆ రైతు చెప్పిన లాజిక్ కరెక్టే అని ఒప్పుకుని కేసు నమోదు చేశారు. ఈ ఆసక్తికర సంఘటన వివరాలు..
ఇది కూడా చదవండి: Indore Fire Accident: ఇండోర్ ఏడుగురు సజీవ దహనం ఘటనలో ట్విస్ట్.. ప్రేమను నిరాకరించినందుకు నిప్పుపెట్టాడు!
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్లో ఈ వింత కేసు నమోదైంది.జితేంద్ర అనే రైతు తన స్నేహితుడితో కలిసి శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి రూ.180 విలువైన తన నల్ల చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. తన చెప్పుల చోరీ వెనుక కుట్ర ఉందని జితేంద్ర పోలీసులకు తెలిపాడు. “దొంగ నా చెప్పులను మరొక నేర స్థలంలో వదిలేస్తే ఆ నేరం రైతు అయిన నాపై పడుతుంది, ఎవరో నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారని” రైతు జితేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. అందుకు బలం చేకూర్చేలా తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: వీడియో: నేను చెప్పింది వినవా! వెంటపడి మరీ మహిళను చితకబాదిన లాయర్!అయితే రైతు చెప్పిన “లాజిక్” పాయింట్ విన్న పోలీసులు మొదట నవ్వుకున్నా, అతడి ఆలోచనాలోతునూ గ్రహించి అతడి నుంచి ఆధారాలు తీసుకుని.. ఫిర్యాదు స్వీకరించారు. చెప్పులు చోరీకి గురవడంపై విచారణ జరుపుతామని రైతురు హామీ ఇచ్చి.. ఇంటికి పంపించారు. మరి ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: రైతును వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే దశ తిరిగింది!