గౌరవమైన స్థానంలో ఉంటూ కొన్ని సార్లు ప్రజా ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అది కాస్త సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర అసెంబ్లీలో మహిళల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం అసెంబ్లీ సమావేశంలో రైతు సమ్యలపై చర్చను పొడిగించాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారు. వారిని అదుపు చేయడం స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే కగేరీకి తలకు మించిన భారంలా అనిపించింది. నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నింటినీ అస్వాదిస్తూ అవునూ.. అవునూ.. అంటూ ఉండాలి.. ఈ క్రమంలో స్పీకర్ ఒకింత అసహనానికి గురయ్యారు.
ఆ సమయంలో సదరు ఎమ్మెల్యే ‘అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమం’ మీరిప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను ఉద్దేశించి కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ మాట్లాడుతూ.. అందరికీ సమయం కేటాయిస్తే సభను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ‘మీరు ఏది నిర్ణయించుకున్నా. నేను సమాధానం ఇస్తాను. నేను ఆలోచిస్తున్నది ఏమిటంటే.. సభా పరిస్థితిని ఆస్వాదిద్దాం. విధాన సభను హుందాగా నడపడమే నా బాధ్యత’ అని తెలిపారు.
ఇదిలా ఉంటే.. కె.ఆర్.రమేశ్ కుమార్ వ్యాఖ్యలను అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం రమేష్ కుమార్ వ్యాఖ్యలపై తప్పుపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, రాజకీయనేతల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావటంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. 2019లోనూ రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో స్పీకర్గా ఉన్న ఆయన తన పరిస్థితి అత్యాచార బాధితురాలిలా ఉందని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.