భారతదేశం నుంచి ఓ మిస్సైల్ పాకిస్తాన్ లోకి దూసుకెళ్లింది. మిస్సైల్ దూసుకెళ్లడం నిజమేనని రక్షణ శాఖ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. వారి భూభాగంలోకి మిస్సైల్ వెళ్లగానే పాకిస్తాన్ ఉరుకులు పరుగులు పెట్టింది. భారత్ పై మొదట దుమ్మెత్తిపోసే ప్రయత్నం కూడా చేసింది. కానీ, భారత్ చాలా సింపుల్ గా మిస్సైల్ మైయిన్ట్ నెన్స్ లో పొరపాటు దొర్లండం వల్లే అలా జరిగిందని క్లారిటీ ఇచ్చింది.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి ఇంటిపై రాళ్లదాడి!
వివరాల్లోకి వెళ్తే.. మార్చి 9న ఇండియా నుంచి ఓ మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. ఆ విషయంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ వాదన ప్రకారం.. ‘ఆ మిస్సైల్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లో 100 కిలోమీటర్లు మేర, ధ్వనికన్నా మూడురెట్ల వేగంగా ప్రయాణించింది. దానికి వార్ హెడ్ లేదు కాబట్టి అది డిటోనేట్ కాలేదు’ అని ప్రకటించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్ కట్టుదిట్టమైన విచారణ చేయాలని డిమాండ్ చేసింది.
ఆ విషయంపై భారత రక్షణ శాఖ కూడా స్పందించింది. మిస్సైల్ ఫైర్ అయిన విషయం నిజమేనని చెప్పింది. సాధారణంగా జరిగే మెయిన్ట్ నెన్స్ సమయంలో టెక్నాలజీ మాలఫంక్షన్ వల్ల ఫైర్ అయినట్లు వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్న కేంద్రం హై లెవల్ కోర్టు విచారణకు ఆదేశించింది. ‘మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లడం ఎంతో విచారించదగ్గ విషయం. అక్కడ ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని తెలిసి కుదుటపడ్డాం’ అంటూ కేంద్రం స్పందించింది. భవిష్యత్ ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించండి అంటూ పాకిస్తాన్- భారత్ ను హెచ్చరించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
WoW even though they were demonstrate the situation ! 🤣
DG ISPR Press Conference: Pakistan Air Defence picked up the Indian super sonic surface to surface missile at the time it was launched from 100 km inside Indian territory its at Mian Channu. pic.twitter.com/Pwrdaq8XfT— Bharatsinh 🇮🇳 (@Bharatmay83) March 10, 2022