పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇక ఇంధన ధరల పెరుగుదలతో.. నిత్యవసరాల ధరలు కూడా పెరిగి.. ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. అబ్బ ఎంత మంచి ఆఫరో కదా అని సంబరపడుతున్నారా.. ఆగండి.. అసలు సంగతి వేరే ఉంది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ తో పాటు మరో 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు గాను నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓటర్లకు కీలక హామీ ఇచ్చారు. బీజేపీకి ఓటేస్తే హోలీ, దీపావళి పండుగలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని మాటిచ్చారు. గోండా జిల్లా కొలోనెల్ గంజ్ అసెంబ్లీ నియోజవవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో రాజ్ నాథ్ సింగ్ ఈ హామీ ఇచ్చారు. నిజానికి దీన్ని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది.
చైనాతో సరిహద్దు వివాదాలు, డ్రాగన్ దేశంతో పాకిస్తాన్ దోస్తీ అంశాలపై పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సైతం రాజ్ నాథ్ సింగ్ యూపీ ఎన్నికల ప్రచారంలో ఘాటుగా బదులిచ్చారు. ‘రాహుల్ గాంధీకి ప్రాచీన భారత చరిత్రే కాదు, కనీసం ఆధునిక భారత చరిత్ర కూడా తెలీదు. పాకిస్తాన్ ఆక్రమించిన షక్స్గామ్ లోయ భూభాగాన్ని చైనాకు అప్పగించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కారకోరం హైవే నిర్మించినప్పుడు ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. చైనా రోడ్, రైల్ బెల్ట్ సీపీఈసీ నిర్మాణం ప్రారంభమైనప్పుడు భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్.. ఇలా అందరూ కాంగ్రెస్ ప్రధానులే ఉన్నారు కానీ.. మోదీ కాదని రాహుల్ కు తెలీదా.. అయినా మోదీ సారధ్యంలోని భారత్ ఇప్పుడు బలహీన దేశం కాదు. బలమైన దేశంగా ఆవిర్భవించింది. ఇవాళ భారత్ చెప్పే ప్రతి మాటను ప్రపంచం శ్రద్ధగా వింటోంది’ అన్నారు రాజ్నాథ్ సింగ్. ఇక యూపీలో మూడో విడత పోలింగ్ ఆదివారం (ఫిబ్రవరి 20)న జరుగనుంది. కేంద్ర హామీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
If voted to power in UP again, BJP Govt will provide free LPG gas cylinder on the ocassion of Holi and Diwali every year: Defence Minister Rajnath Singh in Colonelganj, Gonda pic.twitter.com/B5xcZILkXh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 19, 2022