ఎంత పెద్ద డాక్టర్ అయినా.. తనకు రోగం వస్తే మరో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. టెక్నాలజీ ఎంత పెరిగినా.. మనం ఎంత పెద్ద మేధావులం అయినా.. అన్ని పనులు మనం చేయలేం. ఆ.. ఏంముంది.. తొక్క, ఈ మాత్రం నేను చేయలేనా? యూట్యూబ్లో అన్ని ఉంటాయి, చూస్తూ చేసేస్తా.. అంటే అన్ని సాధ్యపడవు.
ఈ విషయం బుర్రకెక్కని స్వయంప్రకటిత మేధావి పురిటినొప్పులతో బాధపడుతున్న తన భార్యకు యూట్యూబ్లో చూస్తూ తానే డెలివరీ చేసి, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. రాణిపేట జిల్లా అరక్కోణంలో నివసించే లోకనాథన్… తన భార్యకు ఇంట్లోనే పురుడు పోశాడు. ఆండ్రాయిడ్ టీవీని ముందు పెట్టుకుని యూట్యూబ్లో చూస్తూ డెలివరీ చేశాడు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి అరుపులు కేకలు వినిపించడంతో స్థానికులు హడలిపోయారు. రక్తపు మడుగులో ఉన్న మహిళను, పుట్టిన బిడ్డను ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే బిడ్డ మరణించగా, తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లి పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. స్థానికుల కంప్లైంట్తో నిందితుడు లోకనాథన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరి ఇలా యూట్యూబ్లో చూసి ఏదైనా చేసేయవచ్చు భావిస్తున్న కొంతమందికి ఈ ఘటన ఒక కనువిప్పు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.