Children: కొంతమంది వైద్యులు వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి దారుణాలకు తావిస్తున్నారు. తాజాగా, కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారులు హ్యూమన్ ఇమ్యూనో డెఫిసియన్సీ వైరస్(హెచ్ఐవీ) బారిన పడ్డారు. వీరిలో ఓ చిన్నారి మరణించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నాగ్పూర్కు చెందిన నలుగురు చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చికిత్సలో భాగంగా కొద్దినెలల క్రితం వారికి వేరే వ్యక్తుల రక్తం ఎక్కించారు. అయితే, వీరిలో ఓ చిన్నారి ఇటీవలే మరణించింది. అందుకు కారణం ఏంటని ఆరా తీయగా హెచ్ఐవీ అని తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు మిగిలిన ముగ్గురు చిన్నారులకు పరీక్షలు చేయించారు.
వారికి కూడా హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ఈ విషయం కాస్తా బయటకు పొక్కింది. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. దీనిపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి డా.ఆర్కే ధకటే మాట్లాడుతూ.. ‘‘ నలుగురు చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారు. వీరిలో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఎలా జరిగిందన్న దానిపై అన్ని వివరాలు సేకరిస్తున్నాము. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ కూడా ప్రాథమిక దర్యాప్తు చేస్తోంది’’ అని అన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Rajasthan: 9 ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు! కానీ.., పెళ్లి అయ్యాక రోజు భర్తని కొడుతున్న భార్య!