కర్ణాటక తుముకూరు మహీంద్రా షోరూమ్ లో కెంపె గౌడ అనే రైతుకు జరిగిన అవమానం గురించి అందరికి తెలిసిందే. ఆనంద్ మహీంద్రా సైతం ఈ ఘటనపై స్పందించారు. ఆ రైతుకు షోరూం సిబ్బంది చెప్పిన సమయానికి బొలెరో పికప్ ట్రక్ ను ఇంటికే తెచ్చి డెలివరీ చేశారు. అక్కడితో ఈ ఘటన సుఖాంతమైంది. అంతకు ముందు.. కెంపె గౌడకు జరిగిన అవమానంపై చింతిస్తున్నాం అంటూ మహీంద్రా మోటివ్ ట్వీట్ చేసింది. రైతు కెంపె గౌడను తమ సంస్థలోకి ఆనంద్ మహీంద్రా సాదరంగా ఆహ్వానించారు.
Here is our official statement with reference to an incident that happened at one of our dealers’ showrooms in Tumukur, Karnataka. pic.twitter.com/VMwSEoP8Ov
— Mahindra Automotive (@Mahindra_Auto) January 25, 2022
రైతు, అతని స్నేహితులకు జరిగిన అవమానం గురించి ట్విట్టర్ లో క్షమాపణలు చెప్పారు. ‘జనవరి 21న తుముకూరు మహీంద్రా షోరూంలో రైతు కెంపెగౌడ, అతని మిత్రులకు జరిగిన ఆసవకార్యంపై చింతిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం తగిన చర్యలు తీసుకున్నాం. సమస్య పరిష్కారమైంది. మా మహీంద్రా వాహనాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. మహీంద్రా కుటుంబంలోకి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు.
Here is our official update with reference to the incident that happened at one of our dealers’ showrooms in Tumukur, Karnataka. https://t.co/m1lTpObXVC pic.twitter.com/etzQTonykP
— Mahindra Automotive (@Mahindra_Auto) January 28, 2022
అసలు గొడవ ఏంటంటే?
జనవరి 21న బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు కెంపె గౌడ తన మిత్రులతో కలిసి తుముకూరు మహీంద్రా షోరూంకు వెళ్లారు. అక్కడున్న సేల్స్ మెన్ ఇదేమి వంద, రెండొందలకు వచ్చే వస్తువు కాదు. దాని ధర పది లక్షల రూపాయలు. నీ దగ్గర పది రూపాయలు కూడా ఉండవంటూ హేళన చేస్తూ మాట్లాడాడు. అతని దురుసు ప్రవర్తన, హేళన మాటలతో రైతు మనసు నొచ్చుకుంది. గంటలో పది లక్షలు తీసుకుని తిరిగి షోరూంకు వెళ్ళాడు.
And let me add my welcome to Mr. Kempegowda…🙏🏽 https://t.co/BuKnTNov42
— anand mahindra (@anandmahindra) January 28, 2022
కెంపె గౌడ చర్యతో సేల్స్ మెన్ కు చమటలు పట్టాయి. వెయిటింగ్ లిస్ట్ ఉంది.. ఇప్పుడు డెలివరీ చేయలేము.. నాలుగు రోజులు పడుతుంది అన్నాడు. అతని ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాలని రైతు మిత్రులు డిమాండ్ చేయడంతో వివాదం మళ్లీ మొదలైంది. పరిస్థితి పోలీసుల దాకా చేరడంతో వాళ్ళు కలగ చేసుకుని.. రైతుకు క్షమాపణలు చెప్పించారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. చివరికి ఈ విధంగా తుముకూరు మహీంద్రా షోరూం సిబ్బంది తప్పు దిద్దుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కెమెంట్స్ రూపంలో తెలియజేయండి.