మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కాంగ్రెస్ అగ్రనాయకులకు సమన్లు జారీ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా బుధవారం ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కాగా, 2015లో దర్యాప్తు సంస్థలు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక కేసు దర్యాప్తు ఆపివేశాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
కేసు విచారణ కోసం ఈనెల 8న సోనియాను హాజరుకావాలని సూచించింది. అయితే రాహుల్ గాంధీని మాత్రం కాస్త ముందుగా హాజరు కావాలని కోరినట్లు తెలిసింది. కాగా, ఈ విచారణకు సోనియా గాంధీ హాజరై అన్ని వివరాలు అందిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈడీ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం.. ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. మోదీ పెంపుడు సంస్థగా ఈడీ పని చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. ఇద్దరు కాంగ్రెస్ ప్రముఖ నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని సరికొత్త పిరికిపంద చర్యగా ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: నైట్ క్లబ్లో చైనా మహిళా దౌత్యవేత్తతో రాహుల్ గాంధీ..
కేసేంటంటే..
కాంగ్రెస్కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్లో ఆరోపించారు.
ఇది కూడా చదవండి: రాహుల్పై అభిమానం.. లక్షల ఆస్తి రాసిస్తూ 78 ఏళ్ల బామ్మ వీలునామా
ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ను ఈడీ ప్రశ్నించింది. తాజాగా నేడు(బుధవారం) వారికి సమన్లు జారీ చేసింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే: మంత్రి ఎర్రబెల్లి