గత కొద్ది రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి. కేసులు తగ్గినట్టే తగ్గి థర్డ్ వేవ్ లో కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాతు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. కాగా ఢిల్లీలో కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో తాజాగా అక్కడి ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా వీకెండ్ కర్ఫ్యూ అనేది శని, ఆదివారాల్లో ఉండనున్నట్లు స్పష్టం చేసింది.
ప్రైవేట్ కంపెనీలు 50 శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కార్యకలాపాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ఇప్పటికే సినిమా హాళ్లు, విద్యాసంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ ప్రభుత్వంతో పాటు చాలా రాష్ట్రాలు కూడా వీకెండ్ కర్ఫ్యూదిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సర్కార్ తీసుకున్న వీకెండ్ కర్ఫ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.