దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు క్రమేపీ తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. మొన్న ఐదువేలకు కేసులు పరిమితం అయ్యాయి.. అంతలోనే మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరునంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ భయంతో మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగూ వస్తోంది.
తాజా దేశవ్యాప్తంగా 7,495 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనా వల్ల 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో మొత్తం 78,291 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగిందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి : బ్రేకింగ్: టీడీపీ నేత అశోక్గజపతిరాజుపై కేసు నమోదు!
ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,08,926కు చేరింది. కరోనా మరణాల సంఖ్య మొత్తం 4,78,759కి పెరిగింది. దేశంలో మొత్తం 1,39,69,76,774 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో ఇప్పటివరకు మొత్తం 104 మంది కోలుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/pdWUVwychG pic.twitter.com/WiiJ3GNexm
— Ministry of Health (@MoHFW_INDIA) December 23, 2021