దేశంలో మొన్నటి వరకు కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తి భయాందోళనల కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. భారతదేశంలో కొత్తగా 7,974 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో ప్రకటించింది. బుధవారం 6984 కేసులు నమోదవగా, తాజాగా మరో వెయ్యి అధికమయ్యాయి. ఇది నిన్నటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
నిన్న కరోనా నుంచి 7,948 మంది కోలుకున్నారు. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,47,18,602కు చేరింది. ఇందులో 3,41,54,879 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,76,478 మంది మృతిచెందారు. అలాగే, 343 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి : మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం
దేశంలో ప్రస్తుతం 87,245 మంది హోం క్వారంటైన్లు, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. శంలో మొత్తం 1,35,25,36,986 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. బుధవారం ఒక్కరోజే 68,89,025 మందికి టీకాలు ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/858SQyUN4J pic.twitter.com/KdBFpmSVYZ
— Ministry of Health (@MoHFW_INDIA) December 16, 2021