గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాస్త ప్రమాదాల సంఖ్య తగ్గినా.. లాక్ డౌన్ సడలించిన తర్వాత మళ్లీ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే ముఖ్య కారణం అని అధికారులు అంటున్నారు. మద్యం సేవించి నడపడం.. అతి వేగం, నిద్ర లేమితో ప్రయాణాలు ఇలాంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.
తాజాగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ డ్రైవర్కు ఏకంగా 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.. బస్సు ప్రమాదంలో 22 మంది సజీవదహనానికి కారణమైన ఆ డ్రైవర్కు 10 ఏళ్ల చొప్పున 19 విడతలుగా జైల్లో గడపాలని తీర్పు వెలువరించింది మధ్యప్రదేశ్లోని ఓ కోర్టు. వివరాల్లోకి వెళితే.. 2015 మే 4వ తేదీన 65 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. డీజిల్ ట్యాంక్ బద్దలు కావడంతో మంటలు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం.. అందులో ప్రయాణిస్తున్న 22 మంది సజీవదహనం కాగా, 12మంది ప్రయాణికులు తీవ్రగాయాలపాలయ్యారు.
ఈ దారుణ ఘటనపై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ప్రమాదానికి బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని తేల్చిన కోర్టు. నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్కు 10 ఏళ్ల చొప్పున 19 విడతలుగా జైలులో గడపాలని తీర్పు వెలువరించింది.. అంటే.. 19 విడతలుగా పదేల్ల చొప్పున అంటే.. 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.